
నస్పూర్, వెలుగు: సింగరేణిలో ప్రతీ ఉద్యోగి రక్షణతో పని చేయాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ సూచించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే–7 గని పై శుక్రవారం ఏర్పాటు చేసిన ఫాటల్ ఫ్రీ జూన్–2025 ప్రత్యేక భద్రత అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఉద్యోగుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
జూన్ మాసంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని, అలా జరగకుండా ఉండేందుకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, కార్పొరేట్ సేఫ్టీ జీఎం సూచనల మేరకు ఏటా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్షణ పరికరాలను తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పారు. ఆర్కే–7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్ , గని మేనేజర్ తిరుపతి, గని రక్షణ అధికారి సంతోష్ రావు, సంక్షేమ అధికారి సంతన్, గని పిట్ కార్యదర్శి సారయ్య తదితరులు పాల్గొన్నారు.